నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-04-14T06:04:46+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు వహిస్తూ కొవిడ్ నిబంధనలు పా టించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్
కమ్మర్పల్లి, ఏప్రిల్ 13: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు వహిస్తూ కొవిడ్ నిబంధనలు పా టించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగ ళవారం చౌట్పల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. రోజువారి కేసులు, పరీక్షలు, వ్యాక్సినేషన్ వివరాలు డాక్టర్ రతన్సింగ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ టీకా ఉత్సవ్ పిలుపులో భాగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. బషీరాబాద్ గ్రామశివారులో గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి కల్యాణో త్సవాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మ పురి అర్వింద్, నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర యువనాయకుడు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డిలతో కలిసి పూజలు చేశారు. ఆయన వెంట రుయ్యాడి రాజేశ్వర్, బీజేపీ కమ్మర్పల్లి మండలాధ్యక్షడు నవాతే రం జిత్, కుంట భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.