రూపే కార్డులకు టోకెనైజేషన్‌

ABN , First Publish Date - 2021-10-21T08:03:23+05:30 IST

రూపే డెబిట్‌ కార్డుల భద్రత పెంచేందుకు టోకెనైజేషన్‌ విధానం ప్రవేశపెట్టినట్టు ఎన్‌పీసీఐ ప్రకటించింది

రూపే కార్డులకు టోకెనైజేషన్‌

న్యూఢిల్లీ: రూపే డెబిట్‌ కార్డుల భద్రత పెంచేందుకు టోకెనైజేషన్‌ విధానం ప్రవేశపెట్టినట్టు ఎన్‌పీసీఐ ప్రకటించింది. రూపే కార్డు కస్టమర్లు మర్చంట్‌ వెబ్‌సైట్లలో తమ కార్డులు స్టోర్‌ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఎన్‌పీసీఐ టోకెనైజేషన్‌ విధా నం (ఎన్‌టీఎస్‌) నిలుస్తుందని, ఫలితంగా వారికి మరింత భద్రత లభించడంతో పా టు నిరంతరాయంగా షాపింగ్‌ చేసుకునేందుకు సహాయపడుతుందని తెలిపింది. ఈ విధానంలో కస్టమర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎన్‌క్రిప్టెడ్‌ ‘టోకె న్‌’ రూపంలో స్టోర్‌ అయి ఉంటుంద ని పేర్కొంది. దీనివల్ల షాపింగ్‌ చేసిన ప్రతిసారి కస్టమర్లు వారి సమాచారం అందించాల్సిన అవసరం ఉండదు. అలాగే కస్టమర్‌కు చెందిన కీలక సమాచారం పేమెంట్‌ ఇంటర్మీడియేటరీలు స్టోర్‌ చేసే వీలుండదు. ఎన్‌పీసీఐ సర్టిఫై చేసిన బ్యాంకులు, అగ్రిగేటర్లు మాత్రమే  కార్డుల టోకెన్‌ రిఫరెన్స్‌లు సేవ్‌ చేసే వీలుంటుంది. 

Updated Date - 2021-10-21T08:03:23+05:30 IST