అధ్వానంగా గ్రామీణ రోడ్లు
ABN , First Publish Date - 2021-10-25T05:41:44+05:30 IST
కోరుకొండ మండలం పలు గ్రామీణ రహదారు లకు ఏ విధమైన మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా మారాయి.
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
కోరుకొండ, అక్టోబరు 24: కోరుకొండ మండలం పలు గ్రామీణ రహదారు లకు ఏ విధమైన మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా మారాయి. ఈ రోడ్లపై ప్రయాణం చేయలేక నిత్యం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయదారులు తమ తోటలకు, పొలాలకు వెళ్లే మార్గం లేక, ఈ రోడ్లపై ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నారు. గ్రామీణ రోడ్లన్నీ బురదగుంటలుగా మారిపోయాయి. అయినప్పటికీ పంచా యతీరాజ్ శాఖ అధికారులు గత రోడ్లకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలే దని స్థానికులు ఆరోపిస్తున్నారు. బూరుగుపూడి-నిడిగట్ల, దోసకాయలపల్లి- బూరుగుపూడి, గాదరాడ-కణుపూరు రోడ్లు మరింత అధ్వానంగా మారాయి. వాటికి మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజానీకం కోరుతున్నారు.