తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

ABN , First Publish Date - 2020-11-30T16:11:42+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నదీస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. నదీపరివాహక ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-11-30T16:11:42+05:30 IST