రుషికొండ బీచ్ భేష్
ABN , First Publish Date - 2020-09-20T09:16:33+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రక్రియలో విశాఖ ఎంపికైన నేపఽథ్యంలో రుషికొండ తీరంలో పర్యాటకులకు కల్పిస్తున మెరుగైన సదుపాయాల గురించి శనివారం మొబైల్ లైవ్ ద్వారా జ్యూరీ సభ్యులకు జిల్లా పర్యాటక శాఖాఽధికారి ఆర్.పూర్ణిమాదేవి వివరించారు.
స్వచ్ఛ భారత్ అవార్డుల జ్యూరీ సభ్యులకు వివరించిన పర్యాటక శాఖాధికారి పూర్ణిమాదేవి
ఎండాడ, సెప్టెంబరు 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రక్రియలో విశాఖ ఎంపికైన నేపఽథ్యంలో రుషికొండ తీరంలో పర్యాటకులకు కల్పిస్తున మెరుగైన సదుపాయాల గురించి శనివారం మొబైల్ లైవ్ ద్వారా జ్యూరీ సభ్యులకు జిల్లా పర్యాటక శాఖాఽధికారి ఆర్.పూర్ణిమాదేవి వివరించారు. బీచ్కు వచ్చే పర్యాటకుల కోసం చేపడుతున్న చర్యలు, భద్రతతో కూడిన బోటు షికారు, స్కూబీ డైవింగ్, స్కూబా ట్రైనింగ్, ఎల్ఈడీ దీపాలు, పర్యావరణహితంగా వెదురుతో చేసిన టాయిలెట్ సదుపాయాలు, కూర్చునేందుకు వెదురు బెంచ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, బోటింగ్కు సంబంధించిన కంట్రోల్ రూమ్స్ వంటి అంశాలను జ్యూరీ సభ్యులకు వివరించారు.
పార్కింగ్ చార్జీల వసూలు ప్రారంభం
రుషికొండ తీరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ చార్జీలను శనివారం నుంచి వసూలు చేయడం ప్రారంభించారు. ద్విచక్ర వాహనానికి రూ.10, కారు, ఆటోకు రూ.20, భారీ వాహనాలకు రూ.50 చొప్పున వసూలు చేస్తునారు.