Rushikonda దగ్గర మానవహారానికి టీడీపీ పిలుపు

ABN , First Publish Date - 2022-06-05T15:28:58+05:30 IST

రుషికొండ దగ్గర మానవహారానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ రామారావును హౌస్ అరెస్ట్‌ చేశారు.

Rushikonda దగ్గర మానవహారానికి టీడీపీ పిలుపు

విశాఖ: రుషికొండ దగ్గర మానవహారానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ రామారావును హౌస్ అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు ముందస్తు అరెస్టులు చేశారు. రుషికొండ పర్యాటక ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ఒక్క కొండతోనే ఆగిపోలేదు. లెక్కలేనన్ని అరాచకాలు అక్కడ జరుగుతున్నాయి. ఆ పరిసరాలన్నీ తమ సొంతం అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ‘సెవెన్‌ స్టార్‌’ అభివృద్ధి  పేరుతో రుషికొండ మొత్తానికి ప్రభుత్వం గుండు కొట్టిస్తోంది. పచ్చటి కొండను చుట్టూ తవ్వేసి, చెట్లు నరికేసి బోడికొండగా మార్చింది. రెండేళ్ల కిందటి రుషికొండకు, ఇప్పటికీ పోలికే లేదు. ఎవరికోసమో తెలియదు, అసలు పరమార్థం ఏమిటో తెలియదు. కానీ... అక్కడ భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ సర్కారు న్యాయస్థానాలను అభ్యర్థిస్తోంది. 

Updated Date - 2022-06-05T15:28:58+05:30 IST