నేటి నుంచి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతుబజారు
ABN , First Publish Date - 2021-04-21T06:16:56+05:30 IST
నేటి నుంచి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతుబజారు
మైలవరం: కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రోహిణీ దేవి అన్నారు. మంగళవారం ఆమె తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు బజారును ఇప్పుడు ఉన్న చోట కాకుండా హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్న పాఠశాలలో సకల సౌకర్యాలతో కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశామన్నారు. బుధవారం నుంచి స్టాల్స్ ప్రారంభమవుతాయన్నారు. సీఐ శ్రీను, ఎస్సై రాంబాబు, డీటీ శ్రీహరి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చలువాది మధు, జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.