లాయర్ల కార్పస్ నిధికి రూ.100 కోట్లు: సీఎం జగన్
ABN , First Publish Date - 2020-05-25T23:02:19+05:30 IST
లాయర్ల కార్పస్ నిధికి సీఎం జగన్ రూ.100 కోట్లు ప్రకటించారు. నిధుల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాలని జగన్ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను అదుకుంటున్నామని జగన్ తెలిపారు.
అమరావతి: లాయర్ల కార్పస్ నిధికి సీఎం జగన్ రూ.100 కోట్లు ప్రకటించారు. నిధుల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాలని జగన్ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను అదుకుంటున్నామని జగన్ తెలిపారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి విస్తరించడంపై జగన్ ఆరా తీశారు. కాళ్లవాపు వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని, తక్షణం బాధితులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు జగన్ సూచించారు. కాళ్లవాపు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.