సబితా రెడ్డి, సుధీర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మధు యాష్కి

ABN , First Publish Date - 2021-07-07T21:02:38+05:30 IST

ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూబాగోతాలు ఎవరికి తెలియవని ప్రశ్నించారు. కాంగ్రెస్ భిక్షతో హుడా చైర్మన్ పదవిని పొందారని,

సబితా రెడ్డి, సుధీర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మధు యాష్కి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ నిప్పులు చెరిగారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూబాగోతాలు ఎవరికి తెలియవని ప్రశ్నించారు. కాంగ్రెస్ భిక్షతో హుడా చైర్మన్ పదవిని పొందారని, ఆంధ్రా నాయకుడు లగడపాటితో కలిసి భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చెప్పులేస్తామంటూ నోరు జారతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సుధీర్ రెడ్డి... నీ బాగోతం నాకు తెలియదా... నేనూ మలక్‌పేట్ నుంచే వచ్చా. మల్‌రెడ్డి రంగారెడ్డిని అడిగితే నీ బాగోతం బయటపెడతారు. రంగారెడ్డి జిల్లా మహిళా నేత సబితా ఇంద్రారెడ్డి సిగ్గు, శరం లేకుండా పార్టీ వదిలి పోయారు. మమ్మల్నీ, కాంగ్రెస్‌ను మోసం చేశారు’’ అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.  

Updated Date - 2021-07-07T21:02:38+05:30 IST