వాళ్లని పొగడకపోతే కష్టమే..: సంజయ్ మంజ్రేకర్
ABN , First Publish Date - 2020-08-02T00:36:24+05:30 IST
మాజీ క్రికెటర్ సంయజ్ మంజ్రేకర్ను బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి బోర్డు తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ తనను కామెంటేటర్గా...
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ సంయజ్ మంజ్రేకర్ను బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి బోర్డు తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ తనను కామెంటేటర్గా తీసుకోవాలని, ఐపీఎల్కు కామెంటరీ చేసే అవకాశం ఇవ్వాలని మంజ్రేకర్ బీసీసీఐకి ఓ లేఖ రాశాడు. అయితే అదే విషయంపై అంతకుముందే ఓ ఈమెయిల్ను కూడా బోర్డుకు పంపాడు. అందులో కొన్ని సంచలన విషయాలను మంజ్రేకర్ ప్రస్తావించాడు. కొన్నిసార్లు లెంజెండరీ క్రికెటర్లను పొడగకపోతే వారి ఫ్యాన్స్ బాధపడతారని, కావాలనే వారి గురించి కామెంటేటర్లు మాట్లాడడం లేదని అభిప్రాయపడతారని పేర్కొన్నారు. అయితే తానెప్పుడూ ఎవరినీ కావాలని కించపరచలేదని, కామెంటేటర్గా తన కెరీర్ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని మంజ్రేకర్ వివరించాడు. ఇదిలా ఉంటే మంజ్రేకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
తనను కామెంటేటర్గా తొలగించిన విషయం తెలియగానే షాక్కు గురయ్యానని, ఒక్కసారిగా కాళ్లకింద భూమి కదిలిపోయినట్లు అనిపించిందని చెప్పాడు. అయితే ఆ తర్వాత బీసీసీఐ అధికారి ఒకరు తనకు ఫోన్ చేశారని, కొందరు ఆటగాళ్లకు నచ్చకపోవడం వల్లనే తనను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించినట్లు చెప్పారని మంజ్రేకర్ తెలిపాడు.