త్యాగధనుల పార్టీ కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-08-10T10:35:07+05:30 IST
త్యాగధనులు ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.
పట్టభధ్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
ఘనంగా కాంగ్రెస్ యువజన విభాగం ఆవిర్భావ వేడుకలు
జగిత్యాల టౌన్, ఆగస్టు 9: త్యాగధనులు ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి, యూత్ కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఇటీవల మృతి చెందిన రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం తెలిపి మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి పార్టీకి యువజన విభాగమే వెన్నెముక అని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఒక అరాచక, ఒక రాచరిక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, నాయకులు గిరి నాగభూష ణం, గాజుల రాజేందర్, రఘవీర్ గౌడ్, రవి, దుర్గయ్య, శ్రీనివాస్, రాము, దేవేందర్ రెడ్డి, శరత్ రెడ్డి, మహేష్, రియాజ్, నేహాల్, మహిపాల్ పాల్గొన్నారు.