హైదరాబాద్లో హృదయవిదారక ఘటన...
ABN , First Publish Date - 2021-03-06T12:56:44+05:30 IST
మధుబన్కాలనీ - ఎర్రకుంట ప్రధాన రహదారి పక్కన ..
హైదరాబాద్/రాజేంద్రనగర్ : నెలలు నిండని పసిబిడ్డ మృతదేహాన్ని రోడ్డుపై కుక్కలు పీక్కుతింటున్న హృదయవిదారకర ఘటన మైలార్దేవుపల్లి డివిజన్ ఎర్రకుంట సమీపంలో చోటు చేసుకుంది. మధుబన్కాలనీ - ఎర్రకుంట ప్రధాన రహదారి పక్కన ఓ పసిబిడ్డ పిండం పడేసి ఉంది. కుక్కలు ఆ పిండాన్ని తింటున్నాయి. ఇది గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.