బీఎస్పీతో శిరోమణి అకాలీదళ్ సీట్ల మార్పు
ABN , First Publish Date - 2021-09-09T01:14:51+05:30 IST
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి అమృత్సర్ నార్త్, సుజన్పూర్ సీట్లను వెనక్కి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్..
ఛండీగఢ్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి అమృత్సర్ నార్త్, సుజన్పూర్ సీట్లను వెనక్కి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా శామ్ చౌరాసి, కపుర్తలా అసెంబ్లీ నియోజకవర్గం సీట్లు వారికి కేటాయించనున్నారు. ఈ విషయాన్ని సాద్ నేత దల్జీత్ సింగ్ చీమా ఒక ట్వీట్లో తెలియజేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి గత జూన్లో సాద్, బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది.