లాలూ ప్రతిష్ఠను తేజస్వి దెబ్బతీశాడు : సాధు యాదవ్

ABN , First Publish Date - 2021-12-11T18:19:07+05:30 IST

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పరువు

లాలూ ప్రతిష్ఠను తేజస్వి దెబ్బతీశాడు : సాధు యాదవ్

పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పరువు, ప్రతిష్ఠలను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ మంటగలిపాడని తేజస్వి మేనమామ సాధు యాదవ్ ఆరోపించారు. తేజస్వి తన స్నేహితురాలు రేచల్ గొడిన్హోను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సాధు యాదవ్ ఈ ఆరోపణ చేశారు. 


తేజస్వి యాదవ్ మతాంతర వివాహం చేసుకోవడం లాలూ ప్రసాద్ యాదవ్ పరువు, ప్రతిష్ఠలకు భంగకరమని చెప్పారు. వేరొక మతస్థురాలిని పెళ్లి చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ గౌరవాన్ని తేజస్వి దెబ్బతీశారన్నారు. బిహార్ శాసన సభలో ప్రతిపక్ష నేతగా పిలిపించుకునే అర్హత తేజస్వికి లేదన్నారు. కుటుంబంలోనూ, పార్టీలోనూ ఆయన నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ఈ నియతృత్వాన్ని ఇకపై సాగనివ్వబోమని చెప్పారు. ఆయనకు తాము గుణపాఠం చెబుతామన్నారు. ఇదిలావుండగా ఈ పెళ్లికి సాధు యాదవ్‌ను ఆహ్వానించలేదు. 


తేజస్వి పెళ్లికి ఆహ్వానాలు అందనివారిలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ బిహార్ శాఖ చీఫ్ జగదానంద్ సింగ్, ఇతర ఉన్నత స్థాయి నేతలు కూడా ఉన్నారు. అయితే తేజస్వి దంపతులకు నితీశ్ కుమార్ శుభాకాంక్షలు చెప్పారు. 


తేజస్వి వివాహం దక్షిణ ఢిల్లీలోని సైనిక్ ఫామ్ ప్రాంతంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తేజస్వి తన పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించారు. 


Updated Date - 2021-12-11T18:19:07+05:30 IST