రావికమతం శివారు ప్రాంతం చలిసింగంలో విషాదం

ABN , First Publish Date - 2020-10-21T17:34:15+05:30 IST

విశాఖ: ఇంత టెక్నాలజీ పెరిగినా.. గ్రామాలు సైతం ఆధునికతను సంతరించుకుంటున్నప్పటికీ

రావికమతం శివారు ప్రాంతం చలిసింగంలో విషాదం

విశాఖ: ఇంత టెక్నాలజీ పెరిగినా.. గ్రామాలు సైతం ఆధునికతను సంతరించుకుంటున్నప్పటికీ కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. కొన్ని గ్రామాలకు కనీసం రోడ్డు మార్గం కూడా లేకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల్లో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే ఆసుపత్రికి చేరడానికి ముందే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రావికమతం శివారు ప్రాంతం చలిసింగంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుమార్గం లేక డోలీ ద్వారా కొండ దిగువకు ఓ బాలింతను గ్రామస్తులు తీసుకొచ్చారు. కాగా... అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో బాలింత మృతి చెందింది. ఇప్పటివరకు ఈ గ్రామంలో వైద్యం అందక ముగ్గురు మృత్యువాత పడటం గమనార్హం. 

Updated Date - 2020-10-21T17:34:15+05:30 IST