సాగర్ సిమెంట్స్ లాభంలో భారీ వృద్ధి
ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST
సాగర్ సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరానికి 40 శాతం మధ్యంతర డివిడెండ్లతో పాటు మొత్తం మీద 65 శాతం డివిడెండ్ను చెల్లించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సాగర్ సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరానికి 40 శాతం మధ్యంతర డివిడెండ్లతో పాటు మొత్తం మీద 65 శాతం డివిడెండ్ను చెల్లించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6.5 డివిడెండ్ను ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.49.84 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.1.18 కోట్లతో పోలిస్తే 4,110ు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం 37 శాతం వృద్ధితో రూ.305.87 కోట్ల నుంచి రూ.419.36 కోట్లకు చేరింది. మొత్తం ఏడాదికి రూ.1,379 కోట్ల ఆదాయంపై రూ.185.60 కోట్ల లాభాన్ని ఆర్జించింది.