Saidabad: మహిళను రోడ్డుపైకి ఈడ్చి.. దుర్భాషలాడుతూ చీర లాగే యత్నం
ABN , First Publish Date - 2021-10-13T16:18:24+05:30 IST
కుమారుడిని అకారణంగా కొట్టొద్దని బతిమాలిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు నడిరోడ్డుపై ఈడ్చి చితకబాదారు. దుర్భాషలాడుతూ ఆమె చీర లాగే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై
ఘటనలో తల్లీకొడుకులకు గాయాలు
హైదరాబాద్/సైదాబాద్: కుమారుడిని అకారణంగా కొట్టొద్దని బతిమాలిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు నడిరోడ్డుపై ఈడ్చి చితకబాదారు. దుర్భాషలాడుతూ ఆమె చీర లాగే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైదాబాద్లో మహరాష్ట్రకు చెందిన దంపతులు టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. పక్కనే తన్నీరు శ్రీనివాస్ ఇటీవలే టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. టీ స్టాల్ నిర్వాహకురాలి కుమారుడు సోమవారం టిఫిన్ సెంటర్ సమీపంలో బైకు పార్క్ చేసి వెళ్లాడు. గమనించిన శ్రీనివాస్ బైకును కింద పడేశాడు. తీయమంటే తీస్తాను కదా, బైకు ఎందుకు పడేశారు.. అంటూ టీ స్టాల్ నిర్వాహకురాలి కుమారుడు శ్రీనివా్సను ప్రశ్నించాడు. దీంతో శ్రీనివాస్, అతడి కుమారులు రమేష్, రాజులు అతడిపై దాడి చేయసాగారు. గమనించిన ఆమె తల్లి కుమారుడిని విడిపించేందుకు అడ్డుగా వెళ్లింది. వారు ఆమెను కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకు పోయారు. దుర్భాషలాడుతూ, చీర లాగే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో బాధితురాలికి, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.