జగన్‌ దగ్గర అరిచే, కరిచే బ్యాచ్‌ ఎక్కువగా ఉంది: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2020-05-31T18:45:15+05:30 IST

సీఎం జగన్‌ రాజ్యాంగానికి లోబడి పాలన సాగించాలని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు.

జగన్‌ దగ్గర అరిచే, కరిచే బ్యాచ్‌ ఎక్కువగా ఉంది: శైలజానాథ్‌

కడప: సీఎం జగన్‌ రాజ్యాంగానికి లోబడి పాలన సాగించాలని  పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. జగన్‌ దగ్గర అరిచే, కరిచే బ్యాచ్‌ ఎక్కువగా ఉందన్నారు. సీఎం జగన్‌ సంఖ్యాబలం చూపి భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బాబు ఐదేళ్లలో తెచ్చుకున్న అపఖ్యాతి జగన్‌ ఏడాదిలో తెచ్చుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుల పాలు చేయొద్దని సూచించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.  


Updated Date - 2020-05-31T18:45:15+05:30 IST