‘జగన్కు సిగ్గులేదా?’
ABN , First Publish Date - 2020-02-14T22:26:31+05:30 IST
తండ్రి ఫొటోతో గెలిచిన సీఎం జగన్, ప్రధాని మోదీ, షా గుమ్మాల ముందు చేతులు కట్టుకుని నిలబడటానికి సిగ్గులేదా అని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు.
విజయనగరం: తండ్రి ఫొటోతో గెలిచిన సీఎం జగన్, ప్రధాని మోదీ, షా గుమ్మాల ముందు చేతులు కట్టుకుని నిలబడటానికి సిగ్గులేదా అని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. జగన్కు దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారో చెప్పాలని శైలజానాథ్ మరోసారి డిమాండ్ చేశారు.
రాష్ట్రం, కేంద్రంలో దుష్టపాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5 లక్షల కోట్లు అడగలేక మోదీ దయాదాక్షిణ్యాల కోసం జగన్ పాకులాడటం సిగ్గుచేటన్నారు. రాజకీయాలంటే రంగులు మార్చటం కాదని జనసేనాని పవన్ తెలుసుకోవాలని తులసిరెడ్డి చెప్పారు.