హిమాచల్ ప్రదేశ్ సీఎం, గవర్నర్లను కలిసిన సైనా,కశ్యప్ దంపతులు
ABN , First Publish Date - 2020-11-16T12:51:40+05:30 IST
భారత స్టార్ బ్యాడ్మింటన్ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, గవర్నర్ బండారు దత్తాత్రేయలతో భేటీ....
సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): భారత స్టార్ బ్యాడ్మింటన్ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, గవర్నర్ బండారు దత్తాత్రేయలతో భేటీ అయ్యారు. లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్, ఆమె భర్త షట్లర్ పారుపల్లి కశ్యప్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ను సిమ్లాలోని ఓక్ ఓవర్ అధికార నివాసంలో కలిశారు. బ్యాడ్మింటన్ జంట తనను కలిసిన చిత్రాన్ని సీఎం ఠాకూర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. భారత బ్యాడ్మింటన్ జంట తమను మర్యాదపూర్వకంగానే కలిశారని ఠాకూర్ ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఈ జంట హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు బండారు దత్తాత్రేయను కూడా కలిసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించాలని గవర్నర్ దత్తాత్రేయ బ్యాడ్మింటన్ జంట సైనా, కశ్యప్ లను కోరారు. ఈ మేర దత్తాత్రేయ ట్వీట్ చేశారు.సిమ్లాలోని రాజ్భవన్లో దత్తాత్రేయ హిమాచల్ సంప్రదాయ టోపీ, శాలువలతో బ్యాడ్మింటన్ జంట సైనా, కశ్యప్ లను సత్కరించారు. సైనా, కశ్యప్ లకు సైనా నెహ్వాల్, కశ్యప్ లు గత నెలలో డెన్మార్క్ ఓపెన్ పోటీ కరోనా వల్ల రద్దు చేయడంతో వారు వైదొలిగారు. సైనా ఆసియా పర్యటనతో జనవరిలో బ్యాడ్మింటన్ కోర్టులో దిగనున్నారు.