కొలుకున్న సాయినార్ ఫార్మా ప్రమాద క్షతగాత్రులు
ABN , First Publish Date - 2020-07-02T09:33:02+05:30 IST
సాయినార్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులైన ముగ్గురు ఉద్యోగులు కొలుకున్నారు. ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని వైద్య
గాజువాకలో ముగ్గురికి చికిత్స
నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి మరొకరు తరలింపు
గాజువాక, జూలై 1: సాయినార్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులైన ముగ్గురు ఉద్యోగులు కొలుకున్నారు. ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని వైద్య చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గాజువాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెల్పర్ పి.ఆనంద్బాబు, ట్రైనీ కెమిస్ట్ డి.జానకీరామ్, కెమిస్ట్ ఎం.సూర్యనారాయణలు కొలుకున్నారు.
రియాక్టర్ వద్దకు వెళ్లడమే గుర్తింది..-క్షతగాత్రులు ఆనంద్, జానకీరామ్, సూర్యనారాయణ
మేము సోమవారం రాత్రి సుమారు తొమ్మిది మంది వరకు విధులు నిర్వహిస్తున్నాం. సరిగ్గా రాత్రి 11:30 గంటల సమయంలో రియాక్టర్ నుంచి బెంజిమిడాజోల్ గ్యాస్ లీకైంది. ఈ విషయాన్ని గుర్తించిన కెమిస్టు జానకీరామ్ సమాచారాన్ని షిఫ్ట్ ఇన్చార్జ్కు తెలిపారు. దీంతో సమీపంలో ఉన్న మేము రియాక్టర్ వద్దకు వెళ్లాం. అయితే మేము వెళ్లిన విషయం మాత్రమే గుర్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియలేదు. కోలుకున్న తరువాత ఇక్కడ ఇంత ప్రమాదం జరిగిందని తెలిసి చాలా భయపడ్డాం. భగవంతుని దయవలన ప్రాణాలతో బయటపడ్డాం. ఇది మాకు పునర్జన్మే.