సాయిరెడ్డి, అవంతిలకు ఒకటికి.. ఒకటిన్నర తిరిగిస్తాం!

ABN , First Publish Date - 2021-06-16T08:35:35+05:30 IST

విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, బీజేపీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు

సాయిరెడ్డి, అవంతిలకు ఒకటికి.. ఒకటిన్నర తిరిగిస్తాం!

టీడీపీ నేతలపై కక్ష సాధింపు ఆపండి: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న 


విజయవాడ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, బీజేపీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. వైసీపీలో చేరడం లేదన్న అక్కసుతోనే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివా్‌సలు కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలకు చెందిన బలహీనవర్గాల నేతలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా యాదవ, కొప్పులవెలమ, గౌడ వర్గాలవారిని లక్ష్యంగా చేసుకుని, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఒకటికి.. ఒకటిన్నర తిరిగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విజయవాడలోని తన నివాసం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘‘విజయసాయిరెడ్డి అల్లుడు వెళ్లి పల్లా శ్రీనివాసరావును వైసీపీలో చేరమని అడిగితే ఆయన నిరాకరించారు. అడిగిన వెంటనే అధికార పార్టీలో చేరలేదన్న అక్కసుతోనే శ్రీనివాసరావు, ఆయన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. పల్లా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌లపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. దోపిడీదారులు, కబ్జాకోరులు వైసీపీలో ఉంటే, టీడీపీ వారిని కబ్జాకోరులనడం విచిత్రంగా ఉంది. అవినీతి, అక్రమాల్లో వేదాంతిగా పేరుగడించిన అవంతి ఏమీ తెలియని అమయకుడిలా నటిస్తున్నాడు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జాకోరుల భరతం పడతాం’’ అని బుద్దా హెచ్చరించారు. 

Updated Date - 2021-06-16T08:35:35+05:30 IST