ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించండి
ABN , First Publish Date - 2021-02-25T04:00:47+05:30 IST
మున్సిపల్ ఎ న్నికలు సజావుగా సాగేలా అందరూ సహకరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దని సీ ఐ యు.సుధాకర్రావు అన్నారు.
సీఐ సుధాకర్రావు
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 24 : మున్సిపల్ ఎ న్నికలు సజావుగా సాగేలా అందరూ సహకరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దని సీ ఐ యు.సుధాకర్రావు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎలక్షన్ అధికారులు, అసిస్టెం ట్ ఎలక్షన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నామినేషన్ వేసిన అభ్యర్థులతో అవగాహన సదస్సు ని ర్వహించారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్రావు మాట్లాడుతూ కరోనా కారణంగా నిలిచిన మున్సిపల్ ఎన్నికలు తిరిగి జరుగుతుండగా అభ్యర్థులు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.రాజారమేష్ ప్రేమ్కుమార్, ము న్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ.సతీ్షకుమార్, ఎస్ఐ రవీంద్రరెడ్డి, మేనేజర్ నూరుల్లా పాల్గొన్నారు.