సాక్షికి నిరాశ.. సిల్వర్తో సరిపెట్టుకున్న రెజ్లర్
ABN , First Publish Date - 2020-02-22T03:39:34+05:30 IST
ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ సాక్షి మాలిక్కు నిరాశే మిగిలింది. నబిరా సెన్బేవాపై 5-4 తేడాతో విజయం సాధించి సాక్షి ఫైనల్లో జపాన్కు
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ సాక్షి మాలిక్కు నిరాశే మిగిలింది. నబిరా సెన్బేవాపై 5-4 తేడాతో విజయం సాధించి సాక్షి ఫైనల్లో జపాన్కు చెందిన రెజ్లర్ నయోమీ రుకీతో తలపడింది. అయితే 65 కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి ఓటమిపాలై.. రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
అంతకు ముందు 62 కిలోల విభాగంలో జరిగిన సెమీఫైనల్ మరో రెజర్ల్ సోనమ్ మాలిక్ కూడా ఓటమిపాలైంది. క్రైగిస్థాన్కు చెందిన ఐసులు టైనిబెకోవాతో 11-0 తేడాతో సోనమ్ ఓడింది. ఇక వినేశ్ ఫోగాట్, అన్షు మాలిక్లు తమ మ్యాచుల్లో నెగ్గి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. గురువారం జరిగిన పోరులో సరితా మోర్, పింకిలు స్వర్ణ పతకాలు దక్కించుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.