‘సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలి’
ABN , First Publish Date - 2021-05-11T05:33:18+05:30 IST
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులకు గత నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని సీఐటీయూ నగర కమిటీ అధ్యక్షుడు కె.రాజగోపాల్ ఆసుపత్రి ఏడీ రమేష్కు వినతి పత్రం అందజేశారు.
కర్నూలు(హాస్పిటల్), మే 10: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులకు గత నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని సీఐటీయూ నగర కమిటీ అధ్యక్షుడు కె.రాజగోపాల్ ఆసుపత్రి ఏడీ రమేష్కు వినతి పత్రం అందజేశారు. కరోనా కాలంలో వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. కాబట్టి వీరికి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.