అర్చకులు, ఇమాంలకు గౌరవ వేతనం పెంపు

ABN , First Publish Date - 2021-05-15T09:45:24+05:30 IST

దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా..

అర్చకులు, ఇమాంలకు గౌరవ వేతనం పెంపు

దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అదేవిధంగా ఇమాంలకు ప్రస్తుతమున్న రూ.5 వేలను రూ.10 వేలకు, మౌజంలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చర్చి ఫాదర్లకు గతంలో ఎలాంటి గౌరవ వేతనం లేదు. ఇప్పుడు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-05-15T09:45:24+05:30 IST