పాత పీఆర్సీ మేరకే జీతాలివ్వాలి
ABN , First Publish Date - 2022-01-29T06:09:25+05:30 IST
పాత పీఆర్సీకి అనుగుణంగానే జీతాలివ్వాలని పురపాలక సంఘ ఉద్యోగులు కోరారు.
శ్రీకాళహస్తి, జనవరి 28: పాత పీఆర్సీకి అనుగుణంగానే జీతాలివ్వాలని పురపాలక సంఘ ఉద్యోగులు కోరారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ను కలసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు పీఎంవీ నారాయణరెడ్డి, రవికాంత్, బాలచంద్రయ్య, హుస్సేన్అహ్మద్, ఉమామహేశ్వరరావు, సురేష్, శైలజ, లలిత, ప్రేమ్, శ్రీనివాసులు, సింధు, సాయి పాల్గొన్నారు. చిత్తూరులో జరిగిన దీక్షల్లో పట్టణానికి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల సాధనకే పోరాటం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలుసంఘాల నాయకులు రాఘవులు, రఘు, పీఎంఆర్ ప్రభాకర్రెడ్డి, చెంచురత్నం యాదవ్, సుబ్బారెడ్డి, సుధీర్రెడ్డి, మురళీ నాయుడు, విద్యావతి, నారాయణ, పూర్ణిమ, చంద్రశేఖర్రెడ్డి, మునికృష్ణయ్య, లక్ష్మినారాయణ, సుబ్బారెడ్డి, గంగయ్య, రఫి, శాంతిదుర్గ, శ్రీనాథ్ పాల్గొన్నారు.