ఎక్కొచ్చిన నిచ్చెననే తన్నేస్తారా!: సల్మాన్ ఖుర్షీద్
ABN , First Publish Date - 2021-03-04T07:26:39+05:30 IST
కాంగ్రెస్ పార్టీలో జీ-23 వివాదం కొనసాగుతూనే ఉంది. పార్టీ అధినాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన 23 మంది సీనియర్ నేతలపై మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ విరుచుకుపడ్డారు
న్యూఢిల్లీ, మార్చి 3: కాంగ్రెస్ పార్టీలో జీ-23 వివాదం కొనసాగుతూనే ఉంది. పార్టీ అధినాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన 23 మంది సీనియర్ నేతలపై మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ విరుచుకుపడ్డారు. ఎక్కొచ్చిన నిచ్చెననే తన్నేస్తారా? అని ప్రశ్నించారు. వీళ్లు ఇంతకాలం పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీపైనే దాడికి దిగుతున్నారని ఓ బహిరంగలేఖలో విమర్శించా రు. చిమ్మ చీకట్లు కమ్ముకున్న వేళ.. కేడర్లో ధైర్యం నింపి వెలుతురు దిశగా నడిపించాల్సిందిపోయి.. మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు.