ప్రజలకు అసౌకర్యం కలగకూడదు : ఎమ్మెల్యే రామరాజు

ABN , First Publish Date - 2020-10-25T11:09:09+05:30 IST

గ్రామ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు నగర పంచాయతీ కమిషనర్‌ బోయిన సాల్మన్‌రాజుకు సూచించారు.

ప్రజలకు అసౌకర్యం కలగకూడదు : ఎమ్మెల్యే రామరాజు

ఆకివీడు, అక్టోబరు 24: గ్రామ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు నగర పంచాయతీ కమిషనర్‌ బోయిన సాల్మన్‌రాజుకు సూచించారు. శనివారం అమృతరావునగర్‌ కాలనీ, సాలిపేటలోని ముంపు ప్రాంతాలను పరిశీలిం చారు. స్వచ్ఛమైన నీరు అందించాలని, భుజబలరాయుడు మంచినీటి చెరువు సమీపంలో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలను ప్రక్షాళన చేయించాని ప్రజలు విన్నవించారు  టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, బళ్ల ప్రసాద్‌, బత్తుల రవి, ఆర్‌ఐ పెద్దిరాజు, వీఆర్వో సత్యనారాయణ, అజ్మల్‌, ఆరీఫ్‌, అల్లుసాంబ, జాకీర్‌, డి.రవి, శ్రీను, నరశింహరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-25T11:09:09+05:30 IST