సెలూన్లలో పీపీఈ కిట్లు.... బుకింగ్ ఉంటేనే కటింగ్!
ABN , First Publish Date - 2020-05-23T14:05:07+05:30 IST
గుజరాత్లోని సూరత్లోగల సెలూన్లలో సామాజిక దూరంను అనుసరిస్తూ, కార్యకలాపాలు సాగిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా...
సూరత్: గుజరాత్లోని సూరత్లోగల సెలూన్లలో సామాజిక దూరంను అనుసరిస్తూ, కార్యకలాపాలు సాగిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూనే వినియోగదారులకు సెలూన్ సేవలను అందిస్తున్నారు. అయితే ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే సెలూన్లలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక సెలూన్ నిర్వాహకుడు మాట్లాడుతూ తాము కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నవారికే సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే సెలూన్లో వినియోగదారులు పరిమిత సంఖ్యలో ఉండేలా చూస్తున్నామన్నారు. తమ సెలూన్లో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి సేవలు అందిస్తున్నారని తెలిపారు.