400 సీట్లు గెలుస్తాం: అఖిలేష్

ABN , First Publish Date - 2021-10-13T01:37:37+05:30 IST

కాన్పూర్: 2022లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పారు.

400 సీట్లు గెలుస్తాం: అఖిలేష్

కాన్పూర్: 2022లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని విజయ్ రథ యాత్రలో భాగంగా జరిగిన కాన్పూర్ బహిరంగ సభలో చెప్పారు. కాంగ్రెస్‌తో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోగా సమాజ్‌వాదీ పార్టీకి 47, బీఎస్పీకి 19, కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు దక్కాయి.



Updated Date - 2021-10-13T01:37:37+05:30 IST