Akhilesh yadav : మాకు 400 సీట్లు ఖాయం

ABN , First Publish Date - 2021-08-05T21:44:32+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లను పక్కాగా సాధిస్తామని మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్

Akhilesh yadav : మాకు 400 సీట్లు ఖాయం

లక్నో : వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లను పక్కాగా సాధిస్తామని మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఇప్పటి వరకూ 350కి పైగా స్థానాలను సాధిస్తామని చెబుతూ వస్తున్నామని, కానీ... 400 సీట్లను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్న సందరక్భంగా అఖిలేశ్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటి వరకూ 350 సీట్లు సాధిస్తామని చెబుతూ వస్తున్నాం. కానీ 400 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీజేపీ సర్కార్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.’’ అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, తాము చేపట్టిన పనులకే ప్రస్తుతం ప్రారంభాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ వారికి పని సంస్కృతి అంటే ఏమాత్రం తెలియదని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కనీసం ప్రజలకు ఆక్సిజన్ కూడా అందించలేకపోయారని, గంగా ఒడ్డున మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడిపోయాయని మండిపడ్డారు. నిరుద్యోగంలో, ఉపాధిని అడిగే వారిని చితకబాదటంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా మారిందని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-08-05T21:44:32+05:30 IST