సమర్థవంతమైన యువనేత లోకేశ్‌

ABN , First Publish Date - 2022-01-24T06:29:42+05:30 IST

సమర్థవంతమైన యువనేత లోకేశ్‌

సమర్థవంతమైన యువనేత లోకేశ్‌
ఉయ్యూరులో లోకేశ్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న వైవీబీ రాజేంద్రప్రసాద్‌

ఉయ్యూరు, జనవరి 23 : ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో పయనింప చేయగల సమర్థ వంతమైన యువనేత నారా లోకేశ్‌ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినం పురస్కరిం చుకుని ఆదివారం తెలుగు యువత ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార ్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొని కేక్‌ కట్‌చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భగా మా ట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐటీ, పంచాయ తీరాజ్‌ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి తండ్రికి తగ్గ  తనయుడిగా రాష్ట్రాభి వృద్ధికి కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్‌ లో తెలుగుదేశం పార్టీని  నడిపించగల సత్తా  ఉన్న నాయకుడు లోకేశ్‌ అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు చిరంజీవి, భాస్కర్‌, నరేష్‌, జంజన వీరశ్రీనివాస్‌, వల్లూరు కిరణ్‌, రఘుశర్శ, అప్పలనాయుడు పాల్గొన్నారు. 

తేలప్రోలులో..

ఉంగుటూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను ఆదివారం పార్టీ తేలప్రోలులోని మండల కార్యాలయంలో  ఘనంగా నిర్వహించారు.  పార్టీ  మండల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో  పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  కేక్‌ కట్‌చేసిన అనంతరం వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో వుంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్న ఆంధ్రరాష్ట్ర ముద్దుబిడ్డ నారా లోకేశ్‌ సంపూర్ణఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నామన్నారు. పార్టీ  మండల ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనోక్‌, మండల కో ఆర్డినేటర్‌ దుడ్ల కుమార్‌, పార్టీ తేలప్రోలు, గారపాడు గ్రామ అధ్యక్షులు వెంకటరెడ్డి, చింతయ్య, సీనియర్‌ నాయకులు గాదిరెడ్డి మోహన్‌రెడ్డి,  గుళ్లపల్లి సందీప్‌, షేక్‌ అహ్మద్‌ఫకీర్‌, మునిపల్లి నాగరాజు, గూడపాటి సత్యసాయి పాల్గొన్నారు.

లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని..  

 గన్నవరం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మైనార్టీ సెల్‌ మండల  అధ్యక్షుడు షేక్‌ అబు ల్యాజ్‌ అన్నారు.  ముస్తాబాద హజరత్‌ సయ్య ద్‌ ముస్తఫా ఔలియా దర్గాలో  మైనార్టీ సెల్‌ మండల తెలుగు యువత ఆధ్వర్యంలో ఆది వారం లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు యువత మచిలీ పట్నం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు మండవ అన్వేష్‌,  కంచర్ల ఫణి, ముస్తఫా, బాజీ, బాషా, మహ్మద్‌, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:29:42+05:30 IST