ఆ ఇద్దరిపై అదే ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-03-10T06:20:51+05:30 IST

ఉక్రెయినలో చిక్కుకున్న జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఆ ఇద్దరిపై అదే ఉత్కంఠ

బస్సుల్లో రష్యా సరిహద్దుకు..

అనంతపురం టౌన, మార్చి 9: ఉక్రెయినలో చిక్కుకున్న జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నుంచి మొత్తం 42 మంది వైద్య విద్యకోసం ఉక్రెయిన వెళ్లారు. వీరిలో 40 మంది స్వస్థలాలకు చేరుకున్నారు. తాడిపత్రి గణేష్‌ నగర్‌కి చెందిన చరణ్‌ సింహ, పెద్ద పప్పూరు మండలంలోని ముచ్చుకోట వాసి సాయితేజ ఇంకా ఉక్రెయినలోనే ఉన్నారు. రష్యా సరిహద్దుప్రాంతంలోని సుమీ యూనివర్సిటీలో వీరు చదువుతున్నారు. సుమీ వర్సిటీలో ఉన్న భారత విద్యార్థులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వారంరోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. సహకరించేందుకు రష్యా కూడా అంగీకారం తెలిపిందని, వారిని  బస్సుల్లో సరిహద్దుకు తీసుకొస్తున్నారని కలెక్టరేట్‌ వర్గాలు చెబుతున్నాయి. వీరి రాకకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఇద్దరు స్వదేశానికి చేరితే, జిల్లా విద్యార్థుల రాక వందశాతం విజయవంతం అవుతుంది.

Updated Date - 2022-03-10T06:20:51+05:30 IST