గెలాక్సీ ఎస్ 20 ప్లస్, గెలాక్సీ బడ్స్ ప్లస్ ధరలను వెల్లడించిన శాంసంగ్

ABN , First Publish Date - 2020-07-01T01:05:07+05:30 IST

గెలాక్సీ ఎస్ 20 ప్లస్, గెలాక్సీ బడ్స్ ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధరలను శాంసంగ్ వెల్లడించింది. జులై 1 నుంచి వీటికి ప్రీబుకింగ్

గెలాక్సీ ఎస్ 20 ప్లస్, గెలాక్సీ బడ్స్ ప్లస్ ధరలను వెల్లడించిన శాంసంగ్

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్ 20 ప్లస్, గెలాక్సీ బడ్స్ ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధరలను శాంసంగ్ వెల్లడించింది. జులై 1 నుంచి వీటికి ప్రీబుకింగ్ ప్రారంభం కానుండగా, పదో తేదీ నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. గెలాక్సీ ఎస్ 20 ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధర రూ. 87,999 కాగా, గెలాక్సీ బడ్స్ ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధర రూ. 14,990 మాత్రమే. గెలాక్సీ ఎస్20 అల్ట్రా వైట్ వేరియంట్ రూ. 97,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మూడు ఉత్పత్తులు జులై 10 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గెలాక్సీ ఎస్ 20 ప్లస్ రెగ్యులర్ వెర్షన్ ధర రూ. 77,999. ఇది 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. గెలాక్సీ బడ్స్ ప్లస్ కూడా రూ.13,990కే అందుబాటులో ఉంది.  

Updated Date - 2020-07-01T01:05:07+05:30 IST