‘శాంసంగ్ 2020 క్యూలెడ్ 8కె’ టీవీ కొనుగోళ్లపై బోల్డన్ని ఆఫర్లు!

ABN , First Publish Date - 2020-07-07T01:18:26+05:30 IST

శాంసంగ్ సోమవారం సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. శాంసంగ్ సరికొత్త 2020 క్యూలెడ్ 8కె టీవీల కొనుగోలుతో రెండు

‘శాంసంగ్ 2020 క్యూలెడ్ 8కె’ టీవీ కొనుగోళ్లపై బోల్డన్ని ఆఫర్లు!

న్యూఢిల్లీ: శాంసంగ్ సోమవారం సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. శాంసంగ్ సరికొత్త 2020 క్యూలెడ్ 8కె టీవీల కొనుగోలుతో రెండు గెలాక్సీ ఎస్‌ 20 ప్లస్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ పొందేందుకు జులై 10 లోగా శాంసంగ్ క్యూలెడ్ 8కె టీవీలను ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గెలాక్సీ ఎస్20 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ.77,999. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్ ఖాతాదారులకు రూ. 15 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

 

శాంసంగ్ క్యూలెడ్ 8కె 65 అంగుళా టీవీ ధర రూ.4.99 లక్షలు కాగా, 75 అంగుళాల వెర్షన్ ధర రూ.9.99 లక్షలు. 82 అంగుళాల టీవీ ధర రూ. 14.29 లక్షలు కాగా, 85 అంగుళాల వెర్షన్ ధర రూ. 15.79 లక్షలు. ఈ టీవీల కొనుగోలుపై మరిన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై 50 శాతం రాయితీ ఇస్తుండగా, గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా లభిస్తుంది. యాపిల్ మ్యూజిక్ మూడు నెలలపాటు ఉచితం. అలాగే, 5జీబీ క్లౌడ్ స్టోరేజీతో ఆఫీస్ 365 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.  


Updated Date - 2020-07-07T01:18:26+05:30 IST