ఇసుక టిప్పర్ స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-17T05:07:23+05:30 IST
ఎస్ఈబీ నెల్లూరు ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ బి. అశోక్కుమార్ తన సిబ్బందితో కలిసి శనివారం ఒక ఇసుక టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు(క్రైం) జనవరి 16 : ఎస్ఈబీ నెల్లూరు ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ బి. అశోక్కుమార్ తన సిబ్బందితో కలిసి శనివారం ఒక ఇసుక టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. గొలగమూడి నుంచి నెల్లూరు నగరంలోని బీవీ నగర్కు వెళ్లే మార్గంలో ఇసుక టిప్పర్ను ఆపి తనిఖీలు చేశారు. అక్రమంగా 10 టన్నుల ఇసుకను తరలిస్తున్నారని గుర్తించి టిప్పర్ను సాధీనం చేసుకున్నారు. కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన చక్రిరాల మనోజ్కుమార్ను అరె్స్టచేశారు. టిప్పర్ను, నిందితుడిని వేదాయపాలెం పోలీ్సస్టేషన్లో అప్పగించారు.