శ్రీధర్రావు ఆచూకీ చెబితే పారితోషికం: సైబరాబాద్ పోలీసులు
ABN , First Publish Date - 2021-11-30T22:39:16+05:30 IST
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుఆచూకీ కోసం పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ...
హైదరాబాద్: సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు ఆచూకీ కోసం పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సనత్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల నుంచి శ్రీధర్రావు తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రకనటలో పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే నార్సింగ్, రాయదుర్గం గచ్చిబౌలి, పోలీస్ స్టేషన్లలో సైతం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. శ్రీధర్రావు ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీధర్రావు సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే శ్రీధర్రావుపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. దేశం విడిచి ఎక్కడికి పారిపోకుండా లుకౌట్ నోటీసు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు. బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ టీమ్స్ను పంపి శ్రీధర్రావు కోసం గాలిస్తున్నారు.