ఏసీబీ అదుపులో సంగం కంపెనీ కార్యదర్శి

ABN , First Publish Date - 2021-05-14T08:39:17+05:30 IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శి సందీ్‌పను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరికొందరు సిబ్బందిని, ఓ కంప్యూటర్‌ను, డాక్యు

ఏసీబీ అదుపులో సంగం కంపెనీ కార్యదర్శి

చేబ్రోలు, మే 13: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శి సందీ్‌పను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరికొందరు సిబ్బందిని, ఓ కంప్యూటర్‌ను, డాక్యుమెంట్లను తీసుకెళ్లారని సంగం ఉద్యోగులు తెలిపారు. ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి డెయిరీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లోకి ఏసీబీ అధికారులు, సిబ్బంది వెళ్లారని ఆరోపించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు లేకుండా ప్రవేశించడం భయాందోళనలు కలిగిస్తోందన్నారు.

Updated Date - 2021-05-14T08:39:17+05:30 IST