Sangareddy: జిన్నారం హైస్కూల్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-09-07T15:52:20+05:30 IST
జిన్నారం మండలం చెట్ల పోతారం హైస్కూల్లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్లో కరోనా టెస్టులు చేయగా ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ అని
సంగారెడ్డి: జిన్నారం మండలం చెట్ల పోతారం హైస్కూల్లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్లో కరోనా టెస్టులు చేయగా ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులకు, మిగతా ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.