సంగారెడ్డిలో వింత ఘటన...గదిలోకెళ్లి గడియ పెట్టుకున్న కుక్క

ABN , First Publish Date - 2020-08-04T17:35:02+05:30 IST

సంగారెడ్డిలో వింత ఘటన...గదిలోకెళ్లి గడియ పెట్టుకున్న కుక్క

సంగారెడ్డిలో వింత ఘటన...గదిలోకెళ్లి గడియ పెట్టుకున్న కుక్క

సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండాలో వింత ఘటన చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠదామం గదిలోకి వెళ్లి ఓ కుక్క గడియ పెట్టుకుంది. గదికి సున్నం వేయడానికి వచ్చిన కూలీలు.. గదిలోపలి నుంచి గడియ ఉండటంతో ఆశ్చర్యపోయారు. కిటికీ నుంచి లోనికి చూస్తే కుక్క తప్ప మనుషులు కనిపించలేదు. చివరకు స్థానికులు కిటికీ నుంచి గది తలుపు గడియను కట్టెతో తొలగించారు. ఆ వెంటనే శునకం గదిలో నుంచి బయటికి పరుగులు తీసింది. లోపల నుంచి గడియ పెట్టిన గదిలో శునకం ఉన్న దృశ్యాలను ఏబీఎన్ ఎక్స్ క్లూజివ్‌గా సంపాదించింది.



Updated Date - 2020-08-04T17:35:02+05:30 IST