సంగారెడ్డిలో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-12-03T22:54:13+05:30 IST
జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎండు గంజాయిని స్వాధీన పరుచుకున్నారు.
సంగారెడ్డి: జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. న్యాలకల్ మండలం శంశల్లాపూర్ వద్ద ట్రక్కులో మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ తనిఖీల్లో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 43లక్షల 60 వేల రూపాయల విలువైన 436 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.