సంగారెడ్డి జిల్లా: దిగ్వాల్లో దొంగల హల్చల్
ABN , First Publish Date - 2021-09-02T18:11:18+05:30 IST
సంగారెడ్డి జిల్లా: ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు పారిపోతుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే...
సంగారెడ్డి జిల్లా: ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు పారిపోతుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే వారిని వెంబడించారు. దొంగలు ఆటోలో వెళుతుండగా.. స్థానిక యువకులు కారులో వెంబడించారు. చేజింగ్ చేసి వారిని పట్టుకున్నారు. ఈలోగా వచ్చిన పోలీసులకు అప్పగించారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలంలో జరిగింది.
దిగ్వాల్లో దొంగలు హల్ చల్ చేశారు. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన స్థానికులు దొంగలను పట్టుకునేందుకు కారులో వెంబడించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జహీరాబాద్ మండలం, హుగ్గెళ్లి బైపాస్ రోడ్డులో దొంగల ఆటోను పట్టుకున్నారు. ఆ సమయంలో దొంగలు యువకులపై దాడికి యత్నించారు. ప్రతిఘటించి ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక యువకులను అభినందించారు.