సంగారెడ్డి జిల్లా: ఓ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-11-29T18:13:06+05:30 IST
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది.
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను అధికారులు వైద జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపారు. పాజిటీవ్ వచ్చిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.