Sangareddy: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-12T17:56:03+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలు, స్కూళ్లలో కరోనా విజృంభన కొనసాగుతోంది.

Sangareddy: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కరోనా కలకలం

సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలు, స్కూళ్లలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కరోనా కలకలం రేగింది. దాదాపు 119 మంది  విద్యార్థులు, ప్రొఫెసర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు కరోనాతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-12T17:56:03+05:30 IST