కార్పొరేట్లనూ ఆదుకోరూ..

ABN , First Publish Date - 2020-03-27T05:55:15+05:30 IST

పేదలకు ప్రకటించిన తర హాలోనే కార్పొరేట్‌ రంగానికి ప్ర భుత్వం ప్యాకేజీ ఇవ్వాలని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి కోరారు...

కార్పొరేట్లనూ ఆదుకోరూ..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పేదలకు ప్రకటించిన తర హాలోనే కార్పొరేట్‌ రంగానికి ప్ర భుత్వం ప్యాకేజీ ఇవ్వాలని ఫిక్కీ ప్రెసిడెంట్‌  సంగీతా రెడ్డి కోరారు.  ఆర్థిక మంత్రి నుంచి మరిన్ని చర్యలతో కూడిన ప్రకటనల కోసం మేం ఎదురు చూస్తున్నాం. కార్పొరేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం త్వరలో చర్యలు ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆమె అన్నారు. కోవిడ్‌ ప్రభావం వల్ల పలు రంగాలు చిధ్రమయ్యాయని, ఈ పరిస్థితిలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలను ఆదుకోవడం కూడా చాలా అవసరమని సంగీతా రెడ్డి సూచించారు.

 పేదల కోసం ప్రభుత్వం తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రెసిడెంట్‌ కరుణేంద్ర జాస్తి తెలిపారు. కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రాణనష్టాన్ని తగ్గించగలవని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన రిలీఫ్‌ ప్యాకేజీ పేదలకు ఎంతో ఊరట ఇస్తుందని సీఐఐ, తెలంగాణ చైర్మన్‌ కృష్ణ బోదనపు తెలిపారు. 

Updated Date - 2020-03-27T05:55:15+05:30 IST