డ్వాక్రా నిధులు స్వాహా చేసిన సంఘమిత్ర అరెస్టు

ABN , First Publish Date - 2022-01-21T04:30:09+05:30 IST

చిత్తూరు మండలం తాళంబేడు గ్రామ సమాఖ్య వీవో-1 పరిధిలో డ్వాక్రా నిధులు స్వాహా చేసిన సంఘమిత్ర-1 బిందును బీఎన్‌ఆర్‌ పేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

డ్వాక్రా నిధులు స్వాహా చేసిన సంఘమిత్ర అరెస్టు
నిందితురాలు బిందుతో పోలీసులు

చిత్తూరు రూరల్‌, జనవరి 20: చిత్తూరు మండలం తాళంబేడు గ్రామ సమాఖ్య వీవో-1 పరిధిలో డ్వాక్రా నిధులు స్వాహా చేసిన సంఘమిత్ర-1 బిందును బీఎన్‌ఆర్‌ పేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తాళంబేడు వీవో-1 పరిధిలో 27 డ్వాక్రా సంఘాల నుంచి సుమారు రూ.97 లక్షలు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి తాలుకా సీఐ బాలయ్య దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సంఘమిత్ర బిందును గురువారం అరెస్టు చేశారు.

Updated Date - 2022-01-21T04:30:09+05:30 IST