పాక్‌ క్రికెట్‌ జట్టు ‘బబుల్‌’లో సానియా

ABN , First Publish Date - 2021-10-22T07:34:54+05:30 IST

భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు బయో బబుల్‌లోకి ప్రవేశించింది.

పాక్‌ క్రికెట్‌ జట్టు ‘బబుల్‌’లో సానియా

దుబాయ్‌: భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు బయో బబుల్‌లోకి ప్రవేశించింది. సానియా భర్త షోయబ్‌ మాలిక్‌ పాక్‌ టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో ఉన్న నేపథ్యంలో అతడిని కలుసుకొనేందుకు కొడుకుతో కలిసి సానియా ఆ జట్టు బబుల్‌లో అడుగుపెట్టింది. అంతకుముందు తాను టెన్నిస్‌ మ్యాచ్‌ ఆడుతున్నప్పటి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఆమె ‘బబుల్‌లో ప్రవేశించే ముందు క్వారంటైన్‌లో చివరి రెండు రోజులు ఎంతో కష్టంగా గడిచాయి’ అని తెలిపింది. ఇక ప్రపంచకప్‌ సమరాన్ని ఆదివారం భారత్‌తో పోరు ద్వారా పాకిస్థాన్‌ ప్రారంభించనుంది. కాగా..ఆ మ్యాచ్‌ రోజు తాను సోషల్‌ మీడియాలో కనిపించబోనని సానియా వెల్లడించింది. ఆ రోజున ఉండే ఆవేశకావేశాలు, ఆ క్రమంలో వ్యక్తమయ్యే భావోద్వేగపూరిత వ్యాఖ్యలనుంచి తప్పించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించింది. సానియా నిర్ణయాన్ని స్వాగతించిన టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ అది మంచి ఆలోచనగా వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2021-10-22T07:34:54+05:30 IST