విద్యార్థులతో పారిశుధ్య పనులు
ABN , First Publish Date - 2021-10-24T05:45:56+05:30 IST
తర్లుపాడులోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులు పారిశుధ్య కార్మికులుగా మారారు. హాస్టల్లో చదువుతున్న కొందరు విద్యార్థులను హాస్టల్ ముందు ఉన్న మురుగు కాలువలోకి దింపి అందులోని మురుగును తొలగించే పనులను వార్డెన్ చేయించారు. గతంలో హాస్టల్కు వచ్చిన బియ్యాన్ని కూడా లారీ నుంచి విద్యార్థులతోనే కిందికి దింపించారు. పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువును అభ్యసిస్తుండగా వారితో కూలీల మాదిరిగా పనులు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తర్లుపాడు, అక్టోబరు 23: తర్లుపాడులోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులు పారిశుధ్య కార్మికులుగా మారారు. హాస్టల్లో చదువుతున్న కొందరు విద్యార్థులను హాస్టల్ ముందు ఉన్న మురుగు కాలువలోకి దింపి అందులోని మురుగును తొలగించే పనులను వార్డెన్ చేయించారు. గతంలో హాస్టల్కు వచ్చిన బియ్యాన్ని కూడా లారీ నుంచి విద్యార్థులతోనే కిందికి దింపించారు. పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువును అభ్యసిస్తుండగా వారితో కూలీల మాదిరిగా పనులు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ముందు మురుగు నీరు నిల్వ ఉండి ఈగలు, దోమలకు నిలయంగా మారింది. హాస్టల్లో స్వీపర్స్ ఉన్నప్పటికీ విద్యార్థులతో వార్డెన్ మురుగు తీయిస్తుండటంతో రోడ్డున వెళ్తున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులతో అలాంటి పనులు చేయించకుండా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.