బారాషహీద్‌ దర్గా పరిశుభ్రతకు ప్రత్యేక సిబ్బంది

ABN , First Publish Date - 2021-10-25T04:21:08+05:30 IST

నెల్లూరుకు తలమానికమైన బారాషహీద్‌ దర్గా పరిశుభ్రతకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నామని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ తెలిపారు.

బారాషహీద్‌ దర్గా పరిశుభ్రతకు ప్రత్యేక సిబ్బంది
వ్యర్థాలను సేకరిస్తున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌

‘క్లాప్‌’లో కమిషనర్‌ దినేష్‌ 

నెల్లూరు (సిటీ), అక్టోబరు 24 : నెల్లూరుకు తలమానికమైన బారాషహీద్‌ దర్గా పరిశుభ్రతకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నామని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం క్లీన్‌ ఏపీ(క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా దర్గా పరిసరాల్లోని వ్యర్థాలను పారిశుధ్య సిబ్బందితో కలిసి ఆయన తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లాప్‌ కార్యక్రమాన్ని నెల రోజులు నిర్వహించాలని సంకల్పించగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఇది విజయవంతమైతే డస్ట్‌ బిన్‌ రహిత నెల్లూరును త్వరలోనే చూడవచ్చన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా నిర్ణీత ప్రాంతాల్లోనే వేయడం వల్ల వ్యర్థాలు రోడెక్కవని చెప్పారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌వో వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T04:21:08+05:30 IST